PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మండల స్థాయి ఆడుదాం ఆంధ్ర క్రీడలను విజయ వంతం చేయండి

1 min read

మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి

ఆడుదాం ఆంధ్ర క్రీడలు పారదర్శకంగా నిర్వహించాలి

యం.పీ.పీ : మురళీ కృష్ణ రెడ్డి

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: మండల స్థాయిలో  జనవరి 10నుంచి నిర్వహిస్తున్న  ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలను విజయవంతం చేయాలని క్రీడా పోటీలను పారదర్శకంగా నిర్వహించాలని మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి , నందికొట్కూరు ఎంపీపీ మురళీ కృష్ణా రెడ్డి పేర్కొన్నారు. నందికొట్కూరు మండల స్థాయి (రూరల్ మరియు అర్బన్) “ఆడుదాం ఆంధ్ర” క్రీడా పోటీలల్లో భాగంగా క్రికెట్,కబడ్డీ, వాలీబాల్, ఖో- ఖో, షటిల్ బ్యాడ్మింటన్ కి సంబంధించిన పురుషుల మహిళల ఫిక్సర్స్ ను  సోమవారం  మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి , ఎంపీపీ మురళి కృష్ణా రెడ్డి , మున్సిపల్ కమీషనర్ కిషోర్ , మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి  శోభారాణి  ఆధ్వర్యంలో డ్రా నిర్వహించారు. అనంతరం సచివాలయ పరిధిలో జరిగిన ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలల్లో గెలుపొందిన వారికి టీ షర్ట్స్, టోపీలు పంపిణి చేశారు .ఈ కార్యక్రమం లో మున్సిపల్ వైస్ చైర్మన్ అర్షపోగు ప్రశాంతి, కౌన్సిలర్లు రావూఫ్,చాంద్ బాషా, చిన్న రాజు, నాయబ్, కృష్ణ, వైఎస్సార్సీపీ నాయకులు వీ.ఆర్ శీను, కురువ శీను, రమేష్, నంద్యాల జిల్లా శాప్ కో- ఆర్డినేటర్ స్వామిదాస్ రవి కుమార్, కర్నూలు జిల్లా శాప్ కోఆర్డినేటర్ శ్రీనాథ్ పెరుమాళ్ళ, నందికొట్కూరు నియోజక వర్గ ఆడుదాం ఆంధ్ర కో-ఆర్డినేటర్ డోరతి, ఆడుదాం ఆంధ్ర మండల కో-ఆర్డినేటర్ వీరన్న, ఫిజికల్ డైరక్టర్ లు జేసింతదేవి,వీరన్న, రాజేశ్వరి, పద్మలత, విజయ కుమారి,లక్ష్మి సరస్వతి, సుంకన్న, రాగన్న, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

About Author