PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిద్దాం: టీడీపీ

1 min read

పల్లెవెలుగు వెబ్​, మహానంది: ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తామని మహానంది మండల తెలుగుదేశం పార్టీ బాధ్యుడు బను రామలింగారెడ్డి పిలుపునిచ్చారు . మహానందిలో ఎన్టీఆర్ విగ్రహానికి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని స్థాపించిన వ్యక్తి ఎన్టీఆర్ అని ఎన్నో ఆశయాలతో పార్టీని స్థాపించి రాష్ట్ర ప్రజలకు సేవ చేయడానికి పార్టీ శ్రేణులకు అవకాశంకల్పించారు అని అన్నారు. పార్టీ అభివృద్ధి కోసం ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడు ల పని చేయాలని సూచించారు . ఈ కార్యక్రమంలో మహానంది  మాజీ దేవస్థానం చైర్మన్ పాణి ప్రసాదరావు ,తమ్మడపల్లి జనార్దన్ రెడ్డి ,మసీదుపురం మౌళి ఈశ్వర్ రెడ్డి ,గాజులపల్లె ఆర్ఎస్ సర్పంచ్ అస్లాం భాష ,గోపవరం రాముడు,క్రాంతి కుమార్ యాదవ్,ఉల్లి మధు ఇతర నాయకులు పాల్గొన్నారు.

About Author