స్త్రీలను గౌరవిద్దాం..
1 min read
శంకరాస్ డిగ్రీ కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపల్ మద్దిలేటి
కర్నూలు, న్యూస్ నేడు: స్త్రీలను గౌరవించి… వారి విజయానికి తోడ్పాటు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు శ్రీ శంకరాస్ డిగ్రీ కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ మద్దిలేటి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని శనివారం కళాశాల ఆవరణలో విద్యార్థుల సమక్షంలో మహిళా లెక్చరర్లు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఇన్చార్జ్ ప్రిన్సిపల్ మద్దిలేటి మాట్లాడుతూ… మహిళల గొప్పతనం… వారు సమాజానిఇ అందిస్తున్న సేవలను ప్రతిఒక్కరూ తెలుసుకోవాలన్నారు. అదేవిధంగా మహిళల పట్ల జరుగుతున్నటువంటి కృత్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు బి మాధవి , బి. హిమబిందు ఇతర అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.