NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కబ్జాలబారి నుంచి వనపర్తి నియోజకవర్గాన్ని కాపాడుకుందాం..

1 min read

– కాంగ్రెస్ పార్టీ  ఎమ్మెల్యే అభ్యర్థి తూడి మేఘా రెడ్డి….

పల్లెవెలుగు వెబ్​  శ్రీ రంగాపురం: వనపర్తి నియోజకవర్గంలో ఉన్న  ప్రభుత్వ భూములను, ప్రభుత్వ ఆస్తులను కబ్జాలకు గురికాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తూడి మేఘారెడ్డి అన్నారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం శ్రీరంగాపురం మండల పరిధిలోని నాగసానిపల్లి, జానంపేట, వెంకటాపురం,నాగరాల 1.2.3, పునరావాస కేంద్రాలతో పాటు కంబల్లాపూర్, కంబాలపురం, తండ,తాటిపాముల, తాండ గ్రామాలలో పర్యటించారు.ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన ఆయనకు గ్రామస్తులు ఎంతో ఘనంగా స్వాగతం పలికారుడప్పు వాయిద్యాల మధ్యన బాణాసంచా కాల్చి మహిళలు యువకులు నృత్యాలు చేస్తూ  ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గం లో గత 60 ఏళ్ల చరిత్రలో లేని విధంగా అవినీతి అక్రమ పాలన కొనసాగుతుందని ఈ అవినీతి అక్రమ పాలన కొనసాగించే నాయకులను ఈసారి ఇంటికి పంపించాలని ఆయన పిలుపునిచ్చారు.

About Author