PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేద్దాం

1 min read

పల్లెవెలుగు వెబ్​, ప్యాపిలి :పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేద్దాం వైసిపి ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడదాంమని తెలుగుదేశం పార్టీ బీసీ సాధికారిక సమితి రాష్ట్ర కన్వీనర్ వై.నాగేశ్వరరావు యాదవ్ అన్నారు.ఈసందర్భంగా బుధవారం స్థానిక టిడిపి కార్యాలయంలో ఓటర్ల నమోదు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా వై నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికలలో భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ని ఘన విజయంతో గెలిపించి తెలుగుదేశం పార్టీ యొక్క సత్తాచాటాలని, ఈ ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని ఇంకా వేగవంతం చేయాలని ఆయన పేర్కొన్నారు.ఈకార్యక్రమంలో ఆర్. ఈ.రాఘవేంద్ర, గౌతమ్ ,వెంకటేశ్వర రెడ్డి ,ప్రసాద్ రెడ్డి,సుదర్శన్, బంకు నాగేంద్ర,రామ్మోహన్, నాగేంద్ర, మల్లి ,కాంత రెడ్డి ,వడ్డే మాధవ రాజు ఘన మద్దయ్య తదితరులు పాల్గొన్నారు.

About Author