PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యోగాతో ప్రారంభమైన ఆడదాం- ఆంధ్ర”

1 min read

పల్లెవెలుగు వెబ్  చెన్నూరు : చెన్నూరు లోని శివాలయం గుడిలోగల ఆడిటిరియం లో శనివారం యోగా మాస్టర్ శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం లో భాగంగా యోగ కార్యక్రమాన్ని చేపట్టారు, ఈ కార్యక్రమంలో ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ జి ఎన్ భాస్కర్ రెడ్డి, ఎంపీడీవో సుబ్రహ్మణ్యం శర్మ లు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీపీ, చీర్ల సురేష్ యాదవ్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ జి ఎన్ భాస్కర్ రెడ్డిలు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ప్రతి గ్రామ సచివాలయ పరిధిలో ఉత్సాహవంతులైన యువతీ యువకుల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ క్రీడా పోటీలు కొనసాగుతాయని వారు తెలియజేశారు, ఈ పోటీలలో పాల్గొనే యువతీ యువకులు ఆయా గ్రామ సచివాలయాలలో పేర్లు నమోదు చేసుకొని ఆటల పోటీలలో పాల్గొనాలని కోరారు, ఇందులో క్రికెట్, కబడ్డీ, ఖ-ఖో, వాలీబాల్, షటిల్ బ్యాట్మెంటన్ మొదలగు ఆటలు ప్రతి గ్రామ సచివాలయం పరిధిలో నిర్వహించబడతాయని వారు తెలిపారు, అలాగే గ్రామస్థాయి, మండల స్థాయి, నియోజకవర్గస్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయిలో పోటీలు జరుగుతాయని తెలిపారు.. ఆటల పోటీలలో ఎక్కువ మంది పాల్గొనేలా ప్రభుత్వ అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, ప్రజాప్రతినిధులు సమన్వయం చేసుకొని కృషి చేయాలని తెలిపారు,చెన్నూరు మండలానికి ఎక్కువ పథకాలు వచ్చేలా చూడాలని వారు కోరారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు సమన్వయంతో ఈ ఆడదాం ఆంధ్ర కార్యక్రమంను విజయవంతం చేయాలని సూచించారు, ఈ కార్యక్రమంలో కార్యదర్శి రామ సుబ్బారెడ్డి, భరత్ రెడ్డి, యోగి, రాజు ఎంఈలు , సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, విద్యార్థులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

About Author