PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉంటాం… అభివృద్ధి  చేస్తాం  తోడుగా నడుద్దాం

1 min read

– విభరాపురం ఎస్సీ _కాలని వాసులకు సాయినాథ్ శర్మ పిలుపు

పల్లెవెలుగు వెబ్ కమలాపురం:   మీకందరికీ మేమందరం తొడుగా ఉంటాం అభివృద్ధి చేస్తాం కలిసికట్టుగా నడుద్దామని* **తెలుగునాడు ప్రజా సేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు తెలుగు దేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి కాశీ భట్ల సత్య సాయినాథ్ శర్మ విభరాపురం ఎస్సీ కాలని వాసులకు పిలుపు నిచ్చారు. కమలాపురం మండలం లోని విభరాపురం ఎస్సీ కాలనిలో ఆదివారం నాడు హనుమత్ జయంతి సందర్భంగా  కాలని నాయకులఆహ్వానం మేరకు హనుమాన్ జయంతి ఉత్సవాల్లో సాయినాథ్ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.హనుమత్ జయంతి ఉత్సవాలకు  విచ్చేసిన సాయినాథ్ శర్మ కు కాలని వాసులు బాణాసంచ పేల్చుతూ బాజా భజంత్రీ లతో మహిళల మంగళ హారతులతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామికి పూజలు చేసిన అనంతరం సాయినాథ్ శర్మ కాలనీవాసులతో మాట్లాడుతూ మీ *అందరికీ అన్ని విధాలుగా అండగా ఉండి దేవాలయం  కాలని అభివృద్ధి చేస్తామని, అందరం కలిసికట్టుగా నడుద్దామని  పిలుపునిచ్చారు . విబరాపురం కాలనీవాసులకు అభివృద్ధి విషయంలొ* అవసరమైతే *తన స్థాయి మేరకు  శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు *గ్రామంలో ఉన్న తన ఆత్మీయ నాయకులను కలుపుకొని కాలని వాసులకు ప్రణాళిక ప్రకారం* *అభివృద్ధి చేయడానికీ కృషి చేస్తానన్నారు. తనపై_ ఎంతగానో ప్రేమ చూపిన విభరాపురం కాలని వాసులకు సాయినాథ్ శర్మ కృతజ్ఞతలు తెలిపారు* . *_గ్రామ నాయకులు చెన్నారెడ్డి, కాలని నాయకులు, చంద్ర, చెండ్రాయుడు,  తెలుగు దేశం పార్టీ నేతలు సాయినాథ్ శర్మ అభిమానులు బన్నూరు శ్రీధర్ రైతు సంఘం నాయకుడు కల్లూరు జనార్దన్ రెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి  శివరామిరెడ్డి  , చెర్లోపల్లి సిద్దారెడ్డి,వెంకటేశు గంగవరం ఎస్సీ కాలని యువజన నాయకుడు మల్లికార్జున, భారీసంఖ్యలో మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు.

About Author