PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రశ్నించే గొంతులకే పట్టం కడదాం..

1 min read

ప్రచారం చేస్తున్న మద్దతు దారులు..
పల్లెవెలుగు, వెబ్​ వెలుగోడు:పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ పోతుల నాగరాజ్ మద్దతుగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం వెలుగోడు మండల కేంద్రంలో నిర్వహించారు. మండల రిసోర్స్ పర్సన్ కార్యాలయంలో ఎం.ఇ. ఓ బ్రహ్మం నాయక్ , ఇతర ఉపాధ్యాయులను , లిటిల్ ఏంజిల్స్ ఇంగ్లీష్ పాఠశాల లో కరస్పాండెంట్ ఎం.ఎఫ్ ఇమ్మానియెల్ ను , నియోజకవర్గ o లోని ఇతర పాఠశాలల కరస్పాండెంట్ లను , ఉపాధ్యాయులను , గ్రామ సచివాలయం ఒకటి , రెండు కార్యాలయంలో ని సచివాలయం సిబ్బందిని , తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ మహమ్మద్ రఫీ , ఇతర ఉద్యోగుల ను కలసి కరపత్రాలు పంచి పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి యువజన సమాఖ్య జిల్లా అధ్యక్షులు పెరుగు శివకృష్ణ యాదవ్ , జాతీయ బి.సి సంక్షేమ సంఘము రాష్ట్ర కార్యదర్శి రఘు రాముడు యాదవ్, యు. టి.ఎఫ్ నాయకులు మహమ్మద్ రఫీక్ , బీసీ నాయకులు ప్రసాదు , సుబ్బయ్య , రాఘవేంద్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

About Author