PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బీఎస్పీని బలోపేతం చేద్దాం..

1 min read

– పార్టీ శ్రేణులకు బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గద్దల నాగభూషణం పిలుపు

– ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలు ఏకమవ్వాలి :

– బిఎస్పీ జిల్లా ఇన్చార్జి కొత్తూరు లక్ష్మీనారాయణ

పల్లెవెలుగు వెబ్ రాయదుర్గం : బహుజన సమాజ్ పార్టీ బలోపేతానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గద్దల నాగభూషణం పిలుపునిచ్చారు. రాయదుర్గం పట్టణంలోని ఎన్జీవో కార్యాలయంలో గురువారం నిర్వహించిన బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ సమీక్ష సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. పార్టీని గడపగడపకు తీసుకెళ్లడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాల్సిన సమయం ఇది అని తెలిపారు. బూతు స్థాయి, గ్రామస్థాయి, మండల, నియోజకవర్గ కమిటీల నిర్మాణంపై చర్చించారు. బీఎస్పీ జిల్లా ఇన్చార్జ్ కొత్తూరు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ  రాజకీయాల్లో సామాన్యులకు సైతం సముచిత స్థానం, గుర్తింపు, హోదా, గౌరవం దక్కాలంటే ఒక్క బహుజన సమాజ్ పార్టీకే సాధ్యమని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీ బహుజనులంతా ఏకమై బహుజన సమాజ్ పార్టీని బలోపేతం చేయాలని కోరారు. రాయదుర్గం నియోజకవర్గ ఇన్చార్జి ఉల్లిగప్ప మాట్లాడుతూ బహుజన సమాజ్ పార్టీకి శక్తి వంచన లేకుండా నియోజకవర్గంలో బలోపేతం చేయడానికి కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గం అధ్యక్షులు నాగరాజు, ఉపాధ్యక్షులు గంగాధర్, కన్వీనర్ కరీం, నియోజకవర్గం మహిళా అధ్యక్షులు శంకరమ్మ, బొమ్మనాహాల్ మండలం మహిళా అధ్యక్షులు మంజుల కణేకల్ మండలం అధ్యక్షులు మల్లి, రమేష్, శ్రీరాములు, బసన్న, బాంసెఫ్ ఉద్యోగ సంఘమ్ నియోజకవర్గం కన్వీనర్ ఎం. ప్రసాద్, ఏ. ఎఱ్ఱన్న, రమేష్,కొల్లాప్ప  పాల్గొన్నారు.

About Author