PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రండి గెలుద్దాం..

1 min read

సినిమా డెస్క్​ : ‘‘ఇక్కడ మ‌నీతో పాటు మ‌న‌సులు కూడా గెలుచుకోవ‌చ్చు.. ఇక్కడ క‌థ మీది, క‌ల మీది.. ఆట నాది.. కోటి మీది.. రండి గెలుద్దాం.. ఎవ‌రు మీలో కోటీశ్వరులు” అంటూ ఇన్‌స్పైరింగ్‌గా పిలుస్తున్నారు టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్‌‌. ఆయన హోస్ట్ చేస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కార్యక్రమం ఆగస్ట్ నుంచి ప్రసారం కానుంది. ఈ విషయాన్ని తెలియజేసే టీజర్‌ను ఆదివారం విడుదల చేశారు.
క‌రోనా స‌మ‌యంలో పిల్లలు ఫీజులు కూడా క‌ట్టలేని ప‌రిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఓ ప్రైవేటు కాలేజీ లెక్చర‌ర్‌ని జాబ్ మానేయ‌మ‌ంటుంది. దాంతో దోశ బండి పెట్టుకున్న లెక్చరర్ , త‌న స్టూడెంట్స్‌కు డ‌బ్బులు తీసుకోకుండా టిఫిన్స్ పెడుతుంటాడు. క‌ట్ చేస్తే.. అదే లెక్చర‌ర్ హాట్ సీట్‌లో తార‌క్ ఎదురుగా కూర్చుని పాతిక ల‌క్షలు గెలుచుకుంటాడు. ఈ డ‌బ్బునేం చేస్తార‌ని స‌ద‌రు లెక్చర‌ర్‌ని తార‌క్ అడిగుతాడు.. ఫీజులు క‌ట్టలేని మా స్టూడెంట్స్‌కు ఇందులోని స‌గం డ‌బ్బుల‌తో ఫీజు క‌ట్టేస్తాన‌ని, మిగిలిన స‌గం డ‌బ్బులు వాడుకుంటాన‌ని చెప్పడంతో తార‌క్ లెక్చర‌ర్‌ను అభినందిస్తాడు. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 1తో బుల్లితెర‌పై సెన్సేష‌న్ క్రియేట్ చేసిన తారక్‌ మ‌రోసారి బుల్లితెర ప్రేక్షకుల‌ను మెస్మరైజ్ చేయ‌డానికి సిద్ధమ‌వుతున్నారు.

About Author