PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నిరుద్యోగుల గళం వినిపిద్దాం..భూమిరెడ్డిని గెలిపిద్దాం..

1 min read

పల్లెవెలుగు వెబ్​, చెన్నూరు: ఉద్యోగ సమస్యలను శాసనమండలిలో వినిపించాలంటే పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఓటర్లు భూమిరెడ్డి రాo గోపాల్ రెడ్డి ని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని శ్రీనివాసరెడ్డి అన్నారు.  మండలంలో గుర్రంపాడు గ్రామ పంచాయతీ లో  ప్రతి పట్టుభద్రుల ఓటరు ఇంటికి వెళ్లి కరపత్రాన్ని అందించి, ఇంటిదగ్గర లేని వారికి ఫోన్ ద్వారా ఓటు వేయు విధానాన్ని వివరించి  పశ్చిమ రాయలసీమ పట్టుభద్రుల తెలుగుదేశం పార్టీ  అభ్యర్థి  భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డికి మొదటి (1)ప్రాధాన్యతఓటు వేసి గెలిపించవలసినదిగా ఓటర్లను కోరడం జరిగింది.ఈ సందర్భంగా ముండ్ల శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ రాoగోపాల్ రెడ్డి గారిని గెలిపిస్తే ఒక ఉత్తమ వ్యక్తికి ఓటు వేశామని గర్వంగా ప్రతి ఒక్క ఓటరు చెప్పుకునే విధంగా  మండలిలో ఆయన పనితనం ఉంటుందని తెలియచేశారు.అంతే కాకుండా  ప్రజాస్వామ్యన్ని కూని  చేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే క్రమంలో ఈ గెలుపుతో మొదటి అడుగు పడాలని ఆకాంక్షించారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డిని గెలిపించాలని ఈగ్రామాలలో ఉన్న పట్టభద్రులు ఇండ్లకు వెళ్లి తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని గత ఎన్నికల్లో మోసపూరిత వాగ్దానాలతో నమ్మి మోసపోయారని ఈసారి అలా కాకుండా మీరు చదువుకున్న వారు కాబట్టి మీ ఆలోచనలకు తగ్గట్టుగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించే బాధ్యత మీలోనే ఉందని టిడిపి ప్రభుత్వం వస్తేనే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని అన్నారు.ముఖ్యమంత్రి బటన్లు నొక్కడమే తప్పా అభివృద్ధి అనేది కనపడటం లేదని ఓటుతోనే ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పాలని శ్రీనివాసుల రెడ్డి ఓటర్లకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల యువ నాయకులు  వేల్పుల సుబ్రమణ్యం,  మణికంఠ, సాయి కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

About Author