PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జయసూర్య గెలుపుకు కృషి చేద్దాం

1 min read

ఎమ్మార్పీఎస్ నాయకులు ప్రేమరాజు పిలుపు.

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా స్థానికుడైన గిత్త జయసూర్యను అఖండ మెజార్టీతో గెలిపించుకోవాలని ఎమ్మార్పీఎస్ నంద్యాల జిల్లా అధ్యక్షుడు పుట్టపోగు విజేయుడు, ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి ప్రేమరాజు, జిల్లా నాయకులు విజ్జి మాదిగ లు పిలుపునిచ్చారు. సోమవారం అల్లూరు గ్రామంలో టీడీపీ నాయకులు నంద్యాల పార్లమెంట్ ఇంచార్జి మాండ్ర శివానంద రెడ్డి ని ఎమ్మార్పీఎస్ నాయకులు ఘనంగా సన్మానించారు. మాదిగలకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించడంతో ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  త్వరలోనే ఎస్సీ, ఎస్టీ.ఎస్టి.బీసీ. మైనార్టీ  వికలాంగుల అనుబంధ సంఘాలతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటుచేస్తామని పేర్కొ న్నారు.   కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు రెడ్డిపోగు విజయ్, దానమయ్య, పగిడ్యాల ప్రకాశ్ రావు, ఏలీషా, డాన్ శీను మాదిగ ,రాజేష్ , వెంకటేశ్వర్లు జమ్ములయ్య ,స్వాములు, వెంకటేశ్వర్లు, పాల్గొన్నారు.

About Author