PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మిత్రపక్షం అభ్యర్ధుల గెలుపుకు కృషి చేద్దాం

1 min read

– నెల్లూరు జిల్లా ఎస్టీయూ ప్రధాన కార్యదర్శి అప్పన ఏడుకొండలు.
పల్లెవెలుగు, వెబ్ నెల్లూరు: పశ్చిమ రాయలసీమ (కడప, కర్నూలు, అనంతపురం) ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎస్టీయూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్ధి కత్తి నరసింహారెడ్డికి మద్దతు ప్రకటించి గెలుపుకు పాటుపడుతున్న మిత్ర సంఘం యూటిఎఫ్ అభ్యర్ధులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్ధి పి.బాబురెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ధి ఎమ్.వెంకటేశ్వరరెడ్డి లను గెలిపించుకుందామని ఎస్టీయూ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి అప్పన ఏడుకొండలు ఒక ఫ్రకటనలో తెలియజేశారు. నెల్లూరు జిల్లా ఎస్టీయూ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్ర సంఘం ఆదేశాల మేరకు పొత్తులో భాగంగా తూర్పు రాయలసీమ ప్రాంతంలో గల నెల్లూరు జిల్లాలో యూటిఎఫ్ అభ్యర్ధులను బలపరిచి గెలుపుకు కృషి చేద్దామన్నారు. ప్రస్తుత పరిస్ధితులలో ఉద్యోగ ఉపాధ్యాయ వాణిని బలంగా వినిపించాలన్నా, ఉద్యోగ ఉపాధ్యాయ ప్రధాన సమస్యల పరిష్కారం కావాలన్నా, ఎలాంటి ప్రలోభాలకు లొంగని పీ.డీ.ఎఫ్ అభ్యర్ధులను తప్పక గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిదీ అని అన్నారు. వీరితో పాటు జిల్లా ఆర్ధిక కార్యదర్శి కె.నరసింహం తదితరులు పాల్గొన్నారు.

About Author