NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వి.ఆర్.ఓ కె రఘునాథ్ బాబు కి ప్రశంసా పత్రం..

1 min read

పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో 75 వ గణతంత్ర వేడుకలు..

ఉద్యోగుల పనితీరు ద్వారానే ప్రశంసలు..

జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్, జాయింట్ కలెక్టర్ లావణ్య వేణి..

తోటి ఉద్యోగులు, పలువురు అధికారులు ప్రశంసలు..

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  : విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనపరిచి కొంతమంది సచివాలయాలలో పనిచేసిన ఉద్యోగులకు గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఏలూరు జిల్లా కలెక్టర్ మరియు , జాయింట్ కలెక్టర్ లావణ్య వేణి చేతుల మీదుగా ప్రశంసా పత్రంన్ని ఉన్నతాధికారుల సమక్షంలో తంగిళ్ల మూడి సచివాలయం వన్, వి.ఆర్.ఓ. కోచర్ల రఘునాథ్ బాబు(రఘు) అందుకున్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యోగులు బాధ్యతాయుగంగా పనిచేయడం ద్వారానే ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తారని, వారి పనితీరు ద్వారానే ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసలు అందుతాయి అన్నారు. ఈ విధంగా ప్రశంసా పత్రం ఇంతమంది ఉన్నత అధికారుల మధ్య ఆహ్వానితుల మధ్య అందుకోవడం ఆనందంగా ఉందని.తద్వారా ఉద్యోగి గా నాలో మరింత బాధ్యతలు పెరిగాయని, అంకితభావంతో పనిచేస్తానని రఘు తెలిపారు.

About Author