NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎమ్మెల్యే జోగిరమేష్​ను అరెస్టు చేయాలని గవర్నర్​కు లేఖ

1 min read

పల్లెవెలుగు వెబ్​, పత్తికొండ: మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసిపి ఎమ్మెల్యే జోగి రమేష్ దాడి చేయడాన్ని నిరసిస్తూ గురువారం టీడీపీ పత్తికొండ కార్యాలయంలో నాయకులు నిరసన తెలిపారు. ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని వైసీపీ ప్రభుత్వం.. ప్రతిపక్షాలపై దాడులకు పురిగొల్పుతోందని జిల్లా ఉపాధ్యక్షులుసాంబశివరెడ్డి ఆరోపించారు. సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి దాడులకు ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటిపైఐ దాడిచేసిన వారిపై కేసులు పెట్టకుండా.. ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయించడం దారుణమన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, రాష్ట్ర డీజీపీ శాంతిభద్రతలను పరిరక్షించడంలో విఫలమయ్యారన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించాలని కోరుతూ ప్రధాన మంత్రి ,రాష్ట్రపతి ,గవర్నర్లకు లేఖల ప్రతులను పంపారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు తిరుపాలు రామ నాయుడు అశోక్ కుమార్ సోమ్లా నాయక్ గోవిందు గోవిందు సింగం శ్రీనివాసులు మీరా హుస్సేన్ భాష శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

About Author