PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పాలసీదారులకు ఎల్ఐసీ శుభవార్త

1 min read

పల్లెవెలుగువెబ్ : ప్రముఖ బీమా సంస్థ ఎల్ఐసీ పాలసీదారులకు శుభవార్త తెలిపింది. వ్యక్తిగత ల్యాప్స్డ్ పాలసీల పునరుద్ధరణ కోసం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. పాలసీ ప్రీమియం కాలంలో పాలసీలను మధ్యలోనే నిలిపివేసిన పాలసీదారుల తిరిగి తమ పాలసీల పునరుద్దరణకు ఎల్‌ఐసీ అవకాశం కల్పిస్తోంది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 25, 2022 మధ్య కాలంలో అర్హత కలిగి ఉన్న పాలసీదారులు నిలిచిపోయిన తమ పాలసీని తిరిగి పునరుద్దరించుకోవచ్చు అని ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.

      

About Author