PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజలకు మరింత చేరువగా ఎల్‌ఐసీ సేవలు

1 min read

పల్లెవెలుగు వెబ్ వెలుగోడు:  ఎల్‌ఐసీ సేవలను మరింత అందుబాటులోకి తెస్తున్నట్లు ఆత్మ‌కూరు డివిజనల్ బ్రాంచ్ మేనేజర్ పాండురంగ‌నాయ‌క్ తెలిపారు. సోమ‌వారం ప‌ట్ట‌ణంలోని పొట్టి శ్రీ‌రాములు సెంట‌ర్‌లో మెచ్యూరిటీ పాల‌సీ, మ‌నీబ్యాక్ పాల‌సీ క్లైమ్స్ ప‌రిష్కారం కోసం పాల‌సీదారుల‌కు క‌స్ట‌మ‌ర్స్ స‌ర్వీస్ పాయింట్ ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా ఎల్ఐసీ సేవ‌ల‌పై స్థానికుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించారు.  ఈ సంద‌ర్భంగా బ్రాంచ్ మేనేజ‌ర్ మాట్లాడుతూ..దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా విభిన్న పాలసీలను అందుబాటులోకి తెచ్చింద‌న్నారు. టర్మ్ ప్లాన్స్, చిల్డ్రన్స్ ప్లాన్, మనీ బ్యాక్ ప్లాన్స్ వంటి ఎన్నో రకాలు ఉన్నాయ‌న్నారు. వాటిల్లోంచి మీకు అనువైన, నచ్చిన ప్లాన్ ఎంచుకోవచ్చు. ప్రజల నుంచి మంచి ఆదరణ పొందుతోన్న ఎండోమెంట్ పాలసీ జీవన్ ఆనంద్ గురించి వివ‌రిస్తూ..రోజుకు రూ.45 పొదుపు చేస్తే మెచ్యూరిటీ నాటికి ఒకేసారి చేతికి రూ.25 లక్షలు అందిస్తుంద‌న్నారు. ఎల్ఐసీ న్యూ జీవన్ ఆనంద్ ఒక లైఫ్ టైమ్ ఎండోమెంట్ ప్లాన్. ఇందులో పొదుపుతో పాటు బీమా రక్షణ సైతం ఉంటుంద‌న్నారు. గత జీవన్ ఆనంద్ పాలసీని అప్‌గ్రేడ్ చేస్తూ న్యూ జీవన్ ఆనంద్ పాలసీని తీసుకొచ్చార‌ని తెలిపారు. ఇందులో గ్యారంటీ రిటర్న్స్‌తో పాటు ఇతర బెనిఫిట్స్ సైతం లభిస్తాయ‌న్నారు. మీకు నచ్చిన ప్రీమియం పేమెంట్స్ విధానాన్ని ఎంచుకునే వీలుంటుంది. ఒక వేళ పాలసీదారుడు మరణిస్తే డెత్ బెనిఫిట్స్ నామినీకి అందజేస్తారు.   పాలసీదారు జీవించి ఉన్నంత వరకు లేదా 100 ఏళ్ల వయసు వచ్చే వరకు ఇన్సూరెన్స్ కవరేజీ ఉంటుంద‌ని వివ‌రించారు. కార్య‌క్ర‌మంలో ఎల్ఐసీ ఏబీఎం మ‌ధుసుద‌న శెట్టి, ఏవో ఉమాశంక‌ర్‌, సిబ్బంది నాగ‌న్న‌, ఏజెంట్లు స‌య్య‌ద్ మీర్‌, ఫ‌యాజ్ అహ్మ‌ద్‌, న‌ర‌సింహులు, పాప‌న్న గౌడు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

About Author