PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జీవితం.. సేవకు అంకితం..

1 min read

– ఏఆర్​ ఎస్ఐ రామచంద్రరావు
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: విధులలో కఠినంగా వ్యవహరించే పోలీసులు… మానవత్వం.. ప్రేమ చూపడంలోనూ అలాగే వ్యవహరిస్తారని పేర్కొన్నారు ఏఆర్​ ఎస్​ఐ రామచంద్రావు. శుక్రవారం కర్నూలు నగరంలోని శంకర వృద్ధాశ్రమం, కీర్తన అనాధ శరణాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 2019లో అనారోగ్యం కారణంగా తన కుమారుడు మరణించాడని, అతడి జ్ఞాపకార్థం అనాధశ్రమంలోని వృద్ధులు, పిల్లలకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఎస్​ఏపీ క్యాంపులో ఏఆర్​ ఎస్​ఐగా విధులు నిర్వహిస్తున్న రామచంద్రారావు… జిల్లాలోని పలు ప్రాంతాలతోపాటు కడప, అనంతపురం, ప్రకాశం తదితర జిల్లాల్లోనూ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. వృద్ధులు, అనాథలకు చేతనైనంత సహాయం చేస్తానని పేర్కొన్న ఎస్​ఐ రామచంద్రారావు… సహాయం చేయడానికి ఎందరినో ప్రోత్సహించానని స్పష్టం చేశారు.


About Author