NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నాటుసారా స్థావరాలపై మెరుపు దాడి..

1 min read

పల్లెవెలుగు రాయచోటి/వీరబల్లి : వీరబల్లి మండల పరిధిలోని తాటికుంటపల్లె పంచాయతీ షికారుపాలెం అటవీ ప్రాంతంలో నాటుసారా స్థావరాల పై ఆదివారం వీరబల్లి ఎస్ఐ మహమ్మద్ రఫీ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. దాడుల్లో 300 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేసినట్లు ఎస్ఐ మహమ్మద్ రఫీ తెలిపారు. మండలంలో పేకాట, ఇసుక అక్రమ రవాణా, నాటుసారా తదితర అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్​ఐ మహమ్మద్​ రఫీ హెచ్చరించారు.

About Author