PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కలమందలపాడులో ఇంట్లోకి పిడుగు -బట్టలు,నగదు,పత్రాలు ధ్వంసం

1 min read

-ఆదుకోవాలంటున్న పేద మహిళ
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మిడుతూరు మండల పరిధిలోని కలమందలపాడు గ్రామంలో శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో కుటుంబంలోకి పిడుగు చొచ్చుకు వెళ్ళింది.గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన పింజారి నవ్యమ్మ ఇంట్లోకి సాయంత్రం నాలుగు గంటల సమయంలో పెద్ద శబ్దం వస్తూ పిడుగు ఇంట్లోకి వెళ్ళింది.ఇంట్లో ఉన్న పొయ్యి,వస్తువులు,బీరువా కాలిపోయింది.బీరువాలో ఉన్న బట్టలు మరియు నగదు 5 వేలు,పత్రాలు ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంకు పుస్తకం,బియ్యం రెండు ప్యాకెట్లు తదితర వస్తువులన్నీ కూడా పోవడంతో ఆమె కన్నీరు మున్నీరు అయింది. నవ్యమ్మ,మౌలాలికి ఇద్దరు కుమార్తెలు భర్త మౌలాలి గతంలోనే మరణించాడు.ఇద్దరు కూతుర్లకి వివాహం అయ్యింది.కుటుంబంలో నవ్యమ్మ ఒక్కరే నివసిస్తూ ఉన్నారు.పిడుగు పడిన సమయంలో ఆమె ఇంటి బయట ఉండడం వలన ఆమె ప్రాణాపాయం తప్పింది. ప్రభుత్వం మరియు ప్రజాప్రతినిధులు ఆదుకోవాలని నవ్యమ్మ వేడుకుంటుంది.

About Author