వీపనగండ్లలో మద్యం,బైకులు,ఆటో స్వాధీనం..
1 min read
అనుమానీత ప్రాంతాలు ఇళ్లల్లో పోలీసుల సోదాలు
రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్ఐ ఓబులేష్..
మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు : అనుమానిత ప్రాంతాలు అనుమానస్పద వ్యక్తుల ఇళ్లల్లో పోలీసులు సోదాలు చేయడంతో మద్యం బాటిళ్లు-21,సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాలు-9,ఒక ఆటోను నంద్యాల జిల్లా మిడుతూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.మిడుతూరు మండల పరిధిలోని వీపనగండ్ల గ్రామంలో మంగళవారం ఉదయాన్నే నందికొట్కూరు రూరల్ సీఐ టి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో మిడుతూరు ఎస్సై హెచ్ ఓబులేష్ మరియు సిబ్బందితో కలసి శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా గ్రామంలో గార్డెన్స్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.ఈ సందర్భంగా రూరల్ సీఐ మాట్లాడుతూ అసాంఘిక,సంఘ విద్రోహశక్తుల ఆట కట్టించి,నేర రహిత మండలంగా తీర్చిదిద్దడమే పోలీసుల లక్ష్యమని అనుమానిత ప్రాంతాలు,రౌడీ షీటర్ల, అనుమానస్పద వ్యక్తుల ఇళ్ళల్లో జిల్లా పోలీస్ అధికారుల ఆదేశాల మేరకు విస్తృతంగా (సోదాలు) దాడులు నిర్వహించినట్లు సీఐ తెలిపారు.శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా కార్డెన్ అండ్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది.శాంతిభద్రతల పరిరక్షణ మరియు నేరాలను నివారించడమే లక్ష్యంగా మరియు గ్రామాల్లో ఎలాంటి గొడవలు అల్లర్లు జరగకుండా నివారించుటకు పోలీసులు ప్రజల కొరకు ఉన్నారనే భరోసా కల్పించడం కొరకు ఈ కార్డెన్ అండ్ సర్చ్ ఆపరేషన్లు తరచూ నిర్వహిస్తున్నామని గ్రామ ప్రజలకు సీఐ మరియు ఎస్ఐ అవగాహన కల్పించారు. పోలీసు సిబ్బంది బృందాలుగా ఏర్పడి గ్రామంలో అనుమానితులు,రౌడీ షీటర్లు, నేర చరిత్ర గల వారి ఇళ్లల్లో సోదాలు వారు తెలిపారు.ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న నేరాలపై అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా సైబర్ క్రైమ్,రోడ్డు ప్రమాదాలు, మహిళలు,చిన్నారులపై జరిగే నేరాలు మొదలగు వాటిపై అప్రమత్తంగా ఉండాలని,ఏవరైనా చట్టవ్యతిరేక కార్యకలపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
