PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నిర్ణీత ధరకే మద్యం అమ్మకాలు జరగాలి

1 min read

– జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి ఎం రవి కుమార్ రెడ్డి

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె: నియోజకవర్గం లో కలుగొట్ల గ్రామంలో నిర్ణీత ధరకే మద్యం అమ్మకాలు జరగాలని లిక్కర్ బ్రాంచ్ గురించి అవగాహన కల్పించడం జరిగిందని జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి ఎం రవి కుమార్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నియోజకవర్గంలోని కోవెలకుంట్ల మండల పరిధిలో కలుగొట్ల గ్రామంలో గల ప్రభుత్వ మద్యం దుకాణాలను కోయిలకుంట్ల టౌన్ గుంజలపాడు రోడ్ లో గల ప్రభుత్వ దుకాణాల్లో ఆకస్మికంగా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి ఎం రవి కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు చేయడం జరిగింది. స్టాకు నిలువకు సంబంధించిన విధివిధానాల గురించి సూచనలు ఇచ్చి వినియోగదారులకు మద్యం దుకాణాల్లో సమయం వరకు అమ్మకాలు జరిగేలా చర్యలు చేపట్టాలని వారు చెప్పారు.ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ జగదీష్ కానిస్టేబుల్ బీవీ కృష్ణయ్య యాదవ్ ప్రభుత్వం మద్య దుకాణాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author