PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆదోనిలో లాక్​డౌన్​

1 min read
మాట్లాడుతున్న ఆర్డీఓ రామకృష్ణారెడ్డి

మాట్లాడుతున్న ఆర్డీఓ రామకృష్ణారెడ్డి

పల్లెవెలుగు వెబ్​, ఆదోని: పట్టణంలో రోజు రోజుకు పాజిటివ్​ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి లాక్​డౌన్​ విధిస్తున్నట్లు ఆర్డీఓ రామకృష్ణారెడ్డి, మున్సిపల్​ కమిషనర్​ ఆర్​జీవీ కృష్ణ తెలిపారు. గురువారం మున్సిపల్​ కార్యాలయంలోని హాల్​లో వ్యాపారస్తులు, ప్రజలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పట్టణంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి లాక్​డౌన్​ విధిస్తున్నట్లు ప్రకటించారు. ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలలోపు ప్రజలు తమ అత్యవసర పనులను పూర్తి చేసుకోవాలని, మిగతా సమయంలో బయటకు రావొద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, శానిటైజర్​ వాడాలని, భౌతిక దూరం పాటించాలని ఆర్డీఓ రామకృష్ణారెడ్డి, మున్సిపల్​ కమిషనరు ఆర్​జీవీ కృష్ణ తెలిపారు.

About Author