PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తాళం వేసిన ఇల్లే.. టార్గెట్​

1 min read
ఘటనా స్థలిని పరిశీలిస్తున్న పోలీసులు

ఘటనా స్థలిని పరిశీలిస్తున్న పోలీసులు

రూ.17లక్షలు అపహరించిన దుండగులు
– కేసు నమోదు చేసిన గూడురు పోలీసులు
పల్లెవెలుగు వెబ్​, గూడూరు : తాళం వేసిన ఇంటినే టార్గెట్​ చేస్తూ.. చోరీకి పాల్పడుతున్నారు దుండగలు. కోడుమూరు నియోజకవర్గం గూడురు పట్టణంలో తాళం వేసిన ఇంటిలో చోరీకి పాల్పడిన దుండగులు.. దాదాపు రూ. 17 లక్షలు అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీఐ శ్రీధర్​, ఎస్​ఐ నాగార్జున​ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గూడురు పట్టణానికి చెందిన డాక్యుమెంట్ రైటర్ నజీర్ ఇటీవల తన సొంత స్థలాన్ని విక్రయించగా వచ్చిన డబ్బు ఇంట్లో ఉంచి.. కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 15న తెలంగాణ రాష్ట్రంలోని రాజోలిలో తమ బంధువుల పెళ్లికి వెళ్లారు. తిరిగి 18వ తేదీ సాయంత్రం వచ్చి చూడగా… తాళం పగులగొట్టి ఇంట్లోని రూ.17 లక్షలు నగదును దుండగలు ఎత్తుకెళ్లినట్లు నజీర్​ గుర్తించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. సీఐ శ్రీధర్​, ఎస్​ఐ నాగార్జున, ట్రైనీ ఎస్​ఐ మమత, క్లూస్​ టీముతో కలిసి ఘటనా స్థలిని పరిశీలించారు. సీసీ ఫుటేజ్​ పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్​ఐ నాగార్జున తెలిపారు.

About Author