NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

లోకేష్ యువగళానికి బ్రహ్మరతం పడుతున్న ప్రజానీకం

1 min read

– MLC బీద రవి చంద్ర యాదవ్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర కర్నూల్ జిల్లాలో జరుగుతున్న నేపథ్యంలో కర్నూల్ కి విచ్చేసిన MLC బీద రవి చంద్ర యాదవ్ గారు నంద్యాల పార్లమెంట్ అధ్యక్షులు గౌరు వెంకటరెడ్డి గారి ఇంటికి విచ్చేసి యువగళం గురించి వారితో చర్చించడం జరిగింది ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ కర్నూల్ జిల్లాలో పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుందని , యావత్ ప్రజానీకం బ్రహ్మరతం పడుతున్నారని తెలియచేసారు , జగన్ ప్రభుత్వం పై ప్రజలంతా విరక్తి చెందారని రానున్నది టీడీపీ ప్రభుత్వమేనని , రాష్ట్రానికి చంద్రబాబు గారి సువర్ణ పాలనా అందించే రోజులు త్వరలోనే ఉన్నాయ్ అని వారు తెలియచేసారు , వీరితో పాటు బీసీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి MVN.రాజు యాదవ్ గారు కూడా వారితో పాటు పాల్గొని సమావేశంలో చర్చించడం జరిగింది.

About Author