NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దుర్గా భోగేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే కాటసాని

1 min read

పల్లెవెలుగువెబ్, గడివేముల:శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి శ్రీ దుర్గా భోగేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ మర్యాదలతో ఎమ్మెల్యే కాటసానికి పూర్వకుంభంతో స్వాగతం పలికారు స్వామివారి చిత్రపటాన్ని బహుకరించి శాలువాతో సత్కరించారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు  అనంతరం రైతు సంబరాల్లో భాగంగా రాష్ట్రస్థాయి ఎడ్ల పందాలను  ప్రారంభించారు.  18 జతల ఎడ్లు 6 పండ్ల విభాగంలో పోటీలో పాల్గొంటున్నట్టు నిర్వాహకులు తెలిపారు  ఆలయ చైర్మన్ సునీల్ కుమార్ రెడ్డి ఆలయ ఈ ఓ చంద్రశేఖర్ రెడ్డి. జడ్పిటిసి ఆర్.బి చంద్రశేఖర్ రెడ్డి.. మండల వైసిపి నాయకులు   పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు.

About Author