PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యేసుప్రభు ఆశీస్సులు..అందరిపై ఉండాలి

1 min read

టీడీపీ ఎస్సీ సెల్​ ఆర్గనైజింగ్ సెక్రటరి నేషపోగు కిరణ్మయి

  • పాస్టర్లకు, మతపెద్దలకు బట్టలు పంపిణీ

కోడుమూరు, పల్లెవెలుగు:ఏసుప్రభు మార్గం సన్మార్గమని… ఆయన ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు టీడీపీ ఎస్సీ సెల్​ ఆర్గనైజింగ్ సెక్రటరి నేషపోగు కిరణ్మయి. క్రిస్మస్​ పండగ సందర్భంగా ఆదివారం కోడుమూరు నియోజకవర్గం పరిధిలోని ఈ.తాండ్రపాడులోని ఏబీఎన్​ చర్చిలో ఆమె ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం పాస్టర్లు, మత పెద్దలకు, వృద్ధులకు బట్టలు పంపిణీ చేశారు. ఆ తరువాత క్రైస్తవుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కిరణ్మయి మాట్లాడుతూ  ఏసుక్రీస్తు మార్గం…సన్మార్గం అని పేర్కొన్నారు. క్రిస్మస్​ పండగను క్రైస్తవ సోదరసోదరీమణులు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించినట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా పాస్టర్లు, మత పెద్దలు ఆకాంక్షించారు టీడీపీ ఎస్సీ సెల్​ ఆర్గనైజింగ్ సెక్రటరి నేషపోగు కిరణ్మయిని శాలువాతో ఘనంగా సన్మానించారు.

About Author