NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సింహవాహనం పై శ్రీవారు..

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  స్థానిక సంకల్ బాగ్ హరిహర క్షేత్రం లో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి 18 వ వార్షిక బ్రహ్మోత్సవ లలో 8 వ రోజు శ్రీవారు సింహ వాహనం పై భక్తులకు దర్శనం ఇచ్చారు. ఉదయం పంచామృత అభిషేకం విశేష అర్చన అనంతరం నవగ్రహ, దుర్గా, లక్ష్మి కుబేర హోమం లు నిర్వహించారు, సాయంత్రం సింహ వాహనం పై పురావీధుల్లో స్వామి వారు భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ కార్యక్రమం కు ముఖ్య అతిధి గా హై కోర్ట్ GP k v రఘువీర్ కుటుంభ సభ్యులతో హాజరు అయి స్వామి వారి సేవ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కల్లె చంద్రశేఖర్ శర్మ, కార్యదర్శి హెచ్ కె రాజశేఖర రావు, గౌరవ సలహాదారులు హెచ్ కె మనోహరరావు, ఆధ్యాత్మిక ప్రవచన కర్త వేణుగోపాల్ శర్మ, kg ప్రభాకర్ రావు,k.v. సబ్బారావు, రాఘవేంద్ర, ఉమేష్, శివరాం ప్రసాద్, కె.వి భాస్కరరావు, దుర్గాప్రసాద్, తదితరులు పర్యవేక్షణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాయుసేన సేవాదళ్ మరియు మహిళా సేవాదళ్ సభ్యులు.

About Author