PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చంద్రబాబు ప్రజలకు శ్రీరామ రక్ష

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూల్ : తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు శ్రీరామ రక్ష అని పార్టీ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు పి హనుమంతరావు చౌదరి అన్నారు. చంద్రబాబు 73వ పుట్టినరోజు సందర్భంగా సేవ కార్యక్రమాలతో అందరికీ మార్గదర్శకంగా నిలుస్తున్న ఏకైక ప్రజాస్వామ్య పార్టీ తెలుగుదేశం మాత్రమేనని అన్నారు. చంద్రబాబు ను ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటేనే తెలుగు ప్రజలు.. ఆంధ్రదేశం బాగుపడుతుందని తెలిపారు. ఇప్పుడు ఉన్నటువంటి రాక్షస పాలన పోవాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని కోరారు. నిరంతరం ప్రజల కోసం.. ప్రజల గురించి ఆలోచించే చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో ఉండాలని అన్నారు. రాష్ట్ర నాయకుల నుండి మొదలుకుని గల్లి నాయకుల వరకు అందరూ చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తూ.. ప్రజలకు చేరువుగా వుండాలన్నారు. అన్ని వర్గాల ప్రజలను సమానంగా చూసే నాయకులు చంద్రబాబు నాయుడు మాత్రమే నాని చెప్పారు. రాబోయే ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని చంద్రబాబు నాయుడు ను మళ్ళీ గెలిపించి ముఖ్యమంత్రిగా చూడాలని కోరారు. కీర్తిశేషులునందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీని రక్షించేది చంద్రబాబు నాయుడు మాత్రమేనని.. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మళ్లీ మంచి రోజులు రాబోతున్నాయని.. ప్రజలను రక్షించే నాయకుడు.. పాలకుడు చంద్రబాబు నాయుడు అని హనుమంతరావు చౌదరి వివరించారు.

About Author