PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మాదాసి మదారి కురువ ఎస్సీ సంక్షేమ  సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా సోమలింగం

1 min read

పల్లెవెలుగు వెబ్​, పత్తికొండ: ఏపీ మాదాసి మదారి ఎస్సీ సంక్షేమ కురువ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా పత్తికొండ ప్రాంతానికి చెందిన కురువ సోమలింగం ఎన్నికయ్యారు. కర్నూలులోని బీరప్ప స్వామి దేవాలయంలో మాదాసి మదారి కురువ ఎస్సీ సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు దిబ్బ రంగన్న అధ్యక్షతన జరిగిన కార్యవర్గ సమావేశంలో  రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ మేరకు పత్తికొండ ప్రాంతానికి చెందిన కురువ కేఎల్ సోమలింగం రాష్ట్ర అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. అలాగే ఏపీ మాదాసి మదారి కురువ ఎస్సీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా శివలింగం, కోశాధికారిగా మద్దిలేటి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ మాదాసి మదారి కురువ ఎస్సీ సంక్షేమ సంఘం రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు కేఎల్ సోమలింగం మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు మాట నిలబెట్టుకుంటానని చెప్పారు. మాదాసి మదారి కురువ ఎస్సీ సంక్షేమ సంఘం అభివృద్ధికి పాటుపడతానని అన్నారు. ఈ సమావేశానికి మాదాసి మదారి కురువ ఎస్సీ సంక్షేమ సంఘం నాయకులు మురారి, సుంకన్న, ఆంజనేయ, బొంబాయి సుధాకర్, కోటి లింగప్ప, లక్ష్మన్న, రాముడు, శంకరన్న, సిద్ధప్ప బత్తిని మునిస్వామి నాగరాజు తదితరులు హాజరయ్యారు.

About Author