PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మాదినేని లోకేష్ కు ‘మనం –మన ఊరి బడి ’అవార్డు

1 min read

పల్లెవెలుగు వెబ్​, చిట్వేలి : మండలంలోని రాజుకుంట గ్రామానికి చెందిన మాదినేని లోకేష్ ‘ మనం – మన ఊరి బడి ’ అవార్డు (2021)కు ఎంపికయ్యారు. గ్రామీణ ప్రాంత పేద ,మధ్య ,తరగతి విద్యార్థులకు ఉచిత సేవే లక్ష్యంగా పనిచేస్తున్న వారికి ఈ అవార్డు అందజేశారు. రాబోయే రోజుల్లో రాజుకుంట పంచాయతీలో పేద ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఉచిత విద్య అందించడమే లక్ష్యంగా పని చేస్తామని ఈ సందర్భంగా మాదినేని లోకేష్ పేర్కొన్నారు. పిల్లలకి ఏదైనా ఆస్తి ఇవ్వాలి.. అంటే అది ఒక చదివే అని ఆయన అన్నారు. ఈ అవార్డు రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మనం మన ఊరి బడి అధ్యక్షులు పేయ్యల హజరత్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో 100 మందిని ఈ అవార్డుకు ఎంపిక చేశామన్నారు.

About Author