PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నంద్యాలకు బయల్దేరిన మహానంది ఉత్సవమూర్తులు

1 min read

పల్లెవెలుగు వెబ్​, మహానంది: శ్రీ కావ్య శ్రీ దేవి సమేత మహానందీశ్వర స్వామి ఉత్సవమూర్తులు మహానంది నుండి నంద్యాల కు బయలుదేరి వెళ్లాయి .ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి చైర్మన్ మహేశ్వర్ రెడ్డి ఉత్సవమూర్తులకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు .శాస్త్రయుక్తంగా వేద పండితులు రవిశంకర్  అవధాని ,నాగేశ్వర శర్మ ,శాంతారాం బట్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలను నిర్వహించారు . అనంతరం క్షేత్రంలోని గరుడ నంది వద్ద కొద్దిసేపుఆపి పూజలు నిర్వహించి అనంతరం నంద్యాలకు బయలుదేరి వెళ్లాయి .నంద్యాల లోవెలసిన శ్రీ బ్రహ్మానంద స్వామి పెళ్లి పెద్దగా ఆహ్వానించి తమ వెంట తీసుకొని రావడానికి వెళ్లినట్లు వేద పండితులు తెలిపారు .శనివారం సాయంత్రం తిరిగి బ్రహ్మానంద స్వామి ఉత్సవ మూర్తుల తో సహా మహానంది చేరుకుంటాయని తెలిపారు .ఆర్డీవో చాహత్ బాజ్పేయి గరుడ నంది వద్ద ఉత్సవమూర్తులను దర్శించుకొని కొద్దిదూరం పల్లకీ సేవలో పాల్గొన్నారు .ఈ కార్యక్రమంలో ఏఈవో మధు సూపరిండెంట్ వెంకటేశ్వర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు.

About Author