PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహాశివరాత్రి పోస్టర్లు విడుదల చేసిన ఎమ్మెల్యే

1 min read

పల్లెవెలుగు వెబ్ కడప: శ్రీ మల్లేశ్వర దేవస్థానం( పొలతల) మహాశివరాత్రి సందర్భంగా ఈనెల 18వ తేదీన శనివారం శివరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని కడప లోని ఎమ్మెల్యే పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి స్వగృహంలో మహాశివరాత్రి పోస్టర్లను ఎమ్మెల్యే పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, ఆలయ ధర్మకర్త, అలాగే ఆలయ చైర్మన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రస్థాయిలో ప్రసిద్ధిగాంచిన మహా పుణ్య శైవ క్షేత్రం శ్రీశ్రీశ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం (పొలతల) పుణ్యక్షేత్రాన్ని ప్రజలు దర్శించుకుని దేవదేవుని కటాక్ష సన్నిధిలో పునీతులు కాగలరని ఆయన తెలియజేశారు, అనంతరం ఆలయ ధర్మకర్త రాజగోపాల్ రెడ్డి, ఆలయ నిర్వహణ అధికారి మహేశ్వర్ రెడ్డి లు మాట్లాడుతూ, మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే చేతుల మీదుగా పోస్టర్లను ఆవిష్కరించడం జరిగిందన్నారు, అలాగే మహా శైవ క్షేత్ర లలో ఒకటైన (పోలతల) మహోత్సవాల సందర్భంగా ఇక్కడ మహా శివునికి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు ఉంటాయని తెలియజేశారు, శివరాత్రి మహోత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు, అంతేకాకుండా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది అని వారు తెలియజేశారు, కాగా భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆయన కృపాకటాక్షాలకు పాత్రులు కాగలరని వారు పేర్కొన్నారు.. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ చైర్మన్ పులి సునీల్ కుమార్, రాష్ట్ర కాలుష్యమండలి సభ్యులు పాకా సురేష్ తదితరులు పాల్గొన్నారు.

About Author