NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మ‌హాత్మగాంధీ పీఏ మృతి

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: మ‌హాత్మ గాంధీ వ్యక్తిగ‌త కార్యద‌ర్శి వి. క‌ళ్యాణం క‌న్నుమూశారు. చెన్నైలో నివాసం ఉంటున్న ఆయ‌న వ‌యోభారం, అనారోగ్య స‌మ‌స్యల‌తో మంగ‌ళ‌వారం రాత్రి తుది శ్వాస విడిచారు. వి. క‌ళ్యాణం మ‌హాత్మా గాంధీకి వ్యక్తిగ‌త కార్యద‌ర్శిగా ప‌ని చేశారు. 1943 నుంచి 1948 వ‌రకు క‌ళ్యాణం.. మ‌హాత్మాగాంధీ వ‌ద్ద పీఎగా ప‌నిచేశారు. ఆయ‌న స్వతహాగా స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు. చెన్నైలోని కూతురి వ‌ద్ద ఆయ‌న నివాసం ఉంటున్నారు. బీసెంట్ న‌గ‌ర్ స్మశాన‌వాటిక‌లో ఆయ‌న అంత్యక్రియ‌లు నిర్వహిస్తారు.

About Author