PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మ‌హాత్మా గాంధీ విగ్ర‌హం ధ్వంసం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : అమెరికాలో భారత జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి మరోమారు అవమానం జరిగింది. న్యూయార్క్‌లోని శ్రీతులసి మందిర్‌ ఆలయం ఎదుట ఉన్న మహాత్ముడి విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు పూర్తిగా ధ్వంసం చేశారు. రెండు వారాల వ్యవధిలో ఈ విగ్రహంపై ఇది రెండో దాడి. తాజా ఘటన ఈ నెల 16న చోటుచేసుకుంది. గుడి ఎదురుగా ఉన్న గాంధీజీ విగ్రహాన్ని సుత్తితో ధ్వంసం చేసిన ఆరుగురు దుండగులు, పెయింట్‌తో ద్వేషపూరిత వ్యాఖ్యలను రాశారని స్థానిక పోలీసులు తెలిపారు. ఈ నెల 3న సైతం ఈ విగ్రహంపై ఇదే తరహా దాడి జరగడం గమనార్హం. దుండగులందరూ పాతికేళ్ల నుంచి 30 ఏళ్ల లోపు వారేనని అధికారులు అంచనా వేస్తున్నారు.

                                       

About Author