PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో మహాత్మ జ్యోతిరావు పూలె జయంతివేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: జ్యోతి రావ్ గోవిందరావ్  పూలె  జయంతి ని ఘనంగా గురువారం వైస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.ముందుగా మహాత్మా జ్యోతిరావ్ పూలె  చిత్రపటానికి వైస్సార్సీపీ MLA అభ్యర్థి  Amd. ఇంతియాజ్ పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగినది. ఈ సందర్భంగా ఇంతియాజ్ మాట్లాడుతూ,. జ్యోతి రావ్ పూలె భారత దేశంలోనే మొట్ట మొదటి భారతీయ సామాజిక సంస్కర్త అని కొనియాడారు. అణగారిన వర్గాల అభివృద్ధి కోసం పనిచేసినమహనీయుడు అని కొనియాడారు.ఆయన భార్య సావిత్రి బాయి పూలె భారత దేశంలో మహిళా విద్యకు మార్గ దర్శకులని అని అన్నారు. ఇటీవంటి మహాత్ములా ఆశయాలను  కొనసాగించడమే మన ముందున్న కర్తవ్యం అని అన్నారు.అయన ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలనీ అన్నారు. ఈ కార్యక్రమం లో, వైసీపీ నాయకులు, బీసీ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author