PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు కృషి చేద్దాం

1 min read

–రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్

పల్లెవెలుగు వెబ్​:బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితము కావాలని పిలుపునిచ్చారు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్. మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతిని పురస్కరించుకొని నగరంలోని జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి ఆయన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కపిలేశ్వరయ్య, రామస్వామి, రామకృష్ణ, హవిలాన్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహాత్మ జ్యోతిరావు పూలే సేవలను గుర్తు చేస్తూ నగరంలో 2011 వ సంవత్సరంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశామని తెలియజేశారు. మహాత్మ జ్యోతిరావు పూలే భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాలు మన మధ్య ఉన్నాయని తెలిపారు. బీసీల అభ్యున్నతికి మహాత్మ జ్యోతిరావు పూలే దంపతులు ఎంతో కృషి చేశారని అన్నారు. నగరంలో మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహంతో పాటు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ, బాబు జగ్జీవన్ రావు లాంటి ఎందరో దేశ నాయకుల విగ్రహాలను ఏర్పాటు చేశామని వివరించారు. దేశానికి ఎంతో సేవ చేసిన జాతీయ నాయకులకు చరిత్రలు ప్రస్తుతం పుస్తకాల్లో కనిపించడం లేదని జఇలా విగ్రహాలు ఏర్పాటు చేయడం వల్ల భావితరాలు వారి సేవలను తెలుసుకునే అవకాశం ఉందని చెప్పారు. దేశ నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేయడం అంత సులువు కాదని, దానికి ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయని, అయినా వారి సేవలను గుర్తు చేసే విధంగా నగరంలో దేశ నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేశామని వివరించారు .దేశ నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేయడమే కాకుండా వారి పేరుతో సర్కిళ్లను కూడా డెవలప్ చేశామని అన్నారు. జిల్లా పరిషత్ కార్యాలయం ఆవరణలో పార్లమెంటులో ఉన్న తరహాలో మహాత్మా గాంధీ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు .ప్రతి ఒక్కరూ దేశ నాయకుల సేవలను స్మరించుకొని వారి ఆశయ సాధనకు ముందుకు సాగాలని కోరారు .మహాత్మ జ్యోతిరావు పూలే. మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగారని ,ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు ముందుకు సాగాన్ని మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ కోరారు.

About Author