PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మ‌హేష్ బాబు త‌ల్లి క‌న్నుమూత‌

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: టాలీవుడ్ ప్రముఖ నటుడు మహేశ్ బాబు తల్లి ఇందిరాదేవి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని నివాసంలో ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. విషయం తెలిసిన సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కృష్ణ-ఇందిరాదేవికి రమేశ్‌బాబు, మహేశ్‌బాబుతోపాటు కుమార్తెలు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని ఉన్నారు. మహేశ్ బాబు సోదరుడు రమేశ్ బాబు అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు. ఇప్పుడు ఇందిరాదేవి మృతితో ఆ కుటుంబంలో విషాదం అలముకుంది.

                                                      

About Author