PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భూమి కొన్న మ‌హేష్.. ధ‌ర ఎంతంటే ?

1 min read

పల్లెవెలుగు వెబ్​ : టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు భూమి కొన్నారు. హైద‌రాబాద్​లోని జూబ్లిహిల్స్ ఏరియాలో ఆయ‌న ఈ భూమిని కొనుగోలు చేశారు. 1442 చ‌ద‌ర‌పు గ‌జాల ప్లాట్ ను కొనుగోలు చేశారు. య‌ర్రం విక్రాంత్ రెడ్డి అనే వ్యక్తి ద‌గ్గర ఈ భూమిని కొనుగోలు చేశారు. పాత ఇంటిని కూల్చి.. అదే స్థానంలో కొత్త ఇల్లు నిర్మించాల‌నుకున్న య‌ర్రం విక్రాంత్ రెడ్డి.. ఆ త‌ర్వాత ప‌రిస్థితుల మార్పు కారణంగా త‌న ఇంటి స్థలం అమ్మకానికి పెట్టాడు. మ‌హేష్ బాబు ఈ స్థలాన్ని మొత్తం 26 కోట్లకు కొనుగోలు చేశారు. జూబ్లిహిల్స్ ఏరియాలో ఒక్కో చద‌ర‌పు గ‌జం 1.5 ల‌క్షల నుంచి 2 ల‌క్షల వ‌ర‌కు ఉంటుంది.

About Author