PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆధార్ ను సద్వినియోగం చేసుకోండి : ఎంపీడీఓ

1 min read

పల్లెవెలుగు, వెబ్ మిడుతూరు: వివిధ గ్రామాలలో ప్రత్యేకంగా ఆధార్ సేవలను ప్రజలలోకి తీసుకురావడం జరిగిందని వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ జిఎన్ఎస్ రెడ్డి ప్రజలతో అన్నారు.ఈసందర్భంగా కడు మూరు గ్రామంలో చేపట్టిన ఆధార్ సెంటర్ ను ఎంపీడీవో మరియు ఈవోఆర్డి ఫక్రుద్దీన్ పరిశీలించారు.ఆధార్ సెంటర్ లో అందిస్తున్నటువంటి ఆరు రకాల సేవలను వివరించారు.ఈరోజు నాగలూటి గ్రామంలో ఆధార్ సేవలను అందిస్తున్నట్లు వాటిని ప్రజలు వినియోగించుకోవాలని పంచాయతీ కార్యదర్శి సుబ్బారెడ్డి అన్నారు.ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎస్.జీవరత్నం,సీనియర్ అసిస్టెంట్ చక్రవర్తి, పంచాయితీ కార్యదర్శి బి.శివ కళ్యాణ్ సింగ్,వెల్ఫేర్ అసిస్టెంట్ రహిమాన్,డిజిటల్ అసిస్టెంట్ తస్లీమా భాను తదితరులు పాల్గొన్నారు.

About Author