PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాజ్యాధికార సభను జయప్రదం చేయండి..

1 min read

పల్లెవెలుగు, వెబ్ కర్నూలు: ఈనెల 30వ తేదీన తిరుపతిలో జరుగు రాయలసీమ రాజ్యాధికార సభను విజయవంతం చేయాలని బిఎస్పి రాష్ట్ర కోఆర్డినేటర్ బాలయ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అహంకార పూరిత స్వార్థంతో రాయలసీమను అంధకారంలోకి నెట్టి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంచి చోద్యం చూస్తున్నది 75 సంవత్సరాలు పరిపాలించిన రెండు ఆధిపత్య కులాలు కాదా . సంక్షేమ పథకాల ఉచ్చులో బహుజనుల జీవితాలను బుగ్గి చేస్తూ మరోసారి మోసం చేయడానికి తమ పేర్లతో ప్రజల డబ్బు ప్రజలకే పంచుతూ అధికారం కోసం అర్రులు చాస్తున్నారు.రాయలసీమలో రాజ్యాధికారానికి రాకుండా బహుజనుల జీవితాలు బాగుపడవు .ఇక్కడ ప్రధానంగా ఫ్యాక్షన్ మంటలో తమ కుటుంబాలను బలి తీసుకున్న బహుజన కులాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తపించిన. మాన్యవర్ కాన్సిరాం కలలు కన్నా రాజ్యాధికారం కోసం పోరు సల్పకుంటే మన వారసుల భవిష్యత్తు సైతం అంధకారమే ఓట్లు మావి – సీట్లు మీవా- ఇకపై చేల్లదు -చెల్లదు అంటూ నినాదించిన కాన్షిరాం స్థాపించిన బహుజన సమాజ్ పార్టీ లక్ష్యం భారతదేశాన్ని పరిపాలించడమే మనువాదాన్ని పెంచి పోషిస్తున్న బిజెపి. కాంగ్రెస్. టిడిపి .వైసిపిలను. మట్టి కరిపించి బెహన్ కుమారి మాయావతి గారి నాయకత్వంలో సామాజిక పరివర్తనను స్థాపించడమే మన ముందున్న కర్తవ్యం .మతోన్మాదంతో దేశాన్ని చీల్చి వేస్తున్న బిజెపి కులపిచ్చితో ప్రజల జీవితాలతో ఆటాడుకుంటున్న వైసిపి .టిడిపిలకు .దీటైన పార్టీ బీఎస్పీ మాత్రమే ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలను ఏకం చేయగల బహుజన సిద్ధాంతం కలిగిన జాతీయ పార్టీ బీఎస్పీ నని కనుక తిరుపతిలో జరుగు రాయలసీమ రాజ్యాధికార సభకు లక్షలాదిమందిగా తరలిరావాలని వారన్నారు ఈ కార్యక్రమంలో బీఎస్పీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మహేంద్ర నంద్యాల జిల్లా ఇంచార్జ్ గద్దల లాజర్ నందికొట్కూరు నియోజకవర్గం అసెంబ్లీ ఇన్చార్జీలు ఎల్ స్వాములు. వనముల నాగన్న .తాలూకా అధ్యక్షులు .లింగస్వామి .కర్నూలు జిల్లా ఇన్చార్జ్ వనమన్న మండల ఇన్చార్జీలు నాగరాజు నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

About Author