PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపిని గెలిపించండి : టి.జి భరత్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డిని గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే గౌరు చరితరెడ్డి, కర్నూలు టిడిపి ఇంచార్జి టిజి భరత్ ఓటర్లను కోరారు. నగరంలోని బిక్యాంపు పార్కులో ఉదయం టిడిపి నేతలు ప్రచారం నిర్వహించారు. ఓటర్లను కలిసి టిడిపి అభ్యర్థికి ఓటు వేయాలని కోరారు. రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయో పట్టభద్రులు ఆలోచించాలని సూచించారు. 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో అభివ్రుద్ధి జరుగుతుందన్నారు. ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి గెలవాల్సిన అవసరం ఉందన్నారు. విద్యావంతులు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. చంద్రబాబు అధికారంలో ఉంటేనే రాష్ట్రంలో పరిశ్రమలు వచ్చి అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు పెరుగు పురుషోత్తం రెడ్డి, సోమిశెట్టి నవీన్, పార్వతమ్మ, రవి, శ్రీధర్, ప్రభాకర్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు. అనంతరం నగరంలోని భాష్యం స్కూల్, నర్సింగ్ కాలేజీ, కె.ఎన్.ఆర్ స్కూల్లో ప్రచారం నిర్వహించారు. టిడిపి అభ్యర్థికి ఓటు వేయాలని కోరారు.

About Author