PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కాటికాపరుల మహాధర్నా ను జయప్రదం చేయండి

1 min read

– కేజిబియస్ రాష్ట్ర కన్వీనర్ యం డి ఆనంద్ బాబు
పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: స్మశానం లో గుంతలు తీసే కాటికాపరుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మార్చి 20న విజయవాడ లో జరిగే మహా ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కాటికాపరి గుంతలుతీసే బేగరుల సంఘం రాష్ట్ర కన్వీనర్ యం డి ఆనంద్ బాబు పిలుపు నిచ్చారు.శుక్రవారం మండల కేంద్రమైన గోనెగండ్ల లోని ప్రభుత్వ ఆసుపత్రి ముందుబాగంలో కేజిబియస్ మండల అధ్యక్షులు సల్వాది మునిస్వామి అధ్యక్షతన మండల కమిటి సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతితులుగా హాజరైన కేజిబియస్ రాష్ట్ర కన్వీనర్ యం డి ఆనంద్ బాబు, కెవిపియస్ జిల్లా ఉపాధ్యక్షులు బి కరుణాకర్ మాట్లాడారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సాధారణ చావులే కాక, ఆకస్మిక మరణాల ద్వారా చనిపోయిన వ్యక్తుల సవాలు కుళ్ళిన, ఉబ్బినా, దుర్వాసన వస్తున్నా సరే బరిస్తూ గుంతతీసి పూడుస్తూ, కర్రలు పేర్చి కాలుస్తున్న మన బతుకులకు మాత్రం ఎలాంటి భరోసా లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఊరందరికి కలిపి ఎంతో కొంత స్మశాన స్థలాలు వున్నా.. ఊరందరినీ పూడ్చె దళితులకు మాత్రం పూడ్చేందుకు స్థలాలు లేవన్నారు. ప్రతి దళిత వాడకు 2 ఎకరాల స్మశాన స్థలం కేటాయించాలని జీఓ నెంబర్ 1235 సాధించి 20 సంవత్సరాలు పూర్తయినా నేటికి సెంటు స్థలం కేటాయించలేదన్నారు. స్మశానం లో పనిచేసే వృత్తి దారులందరిని 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించి ఉపాధినివ్వాలని, అన్నిరకాల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 20న విజయవాడలో జరిగే మహా ధర్నా కు అత్యధికంగా హాజరు కావాలని వారు పిలుపునిచ్చారు.సమావేశంలో మండల నాయకులు సల్వాది పెద్ద మునిస్వామి, చిన్న రంగన్న, తిమ్మప్ప, సుంకన్న, కన్నయ్య, చిన్నస్వామి, మునిస్వామి, దావీదు, జయరాజు, శంకరయ్య, సుంకన్న, రత్నమయ్య, రాజు, లక్ష్మన్న, పేతురయ్య తదితరులు పాల్గొన్నారు.

About Author