PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఈనెల 24న జరిగే నిరసన దీక్షను విజయవంతం చేయండి

1 min read

– సిఐ సుబ్బరాయుడు చేతులు మీదుగా కరపత్రాలు ఆవిష్కరణ.
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె: రాయలసీమ హక్కులకై కర్నూలు పట్టణంలో ఈనెల 24వ తేదీన ఎస్సీఎస్టీ మైదానంలో జరిగే ఒక్క రోజు నిరసన దీక్షను విజయవంతం చేయాలని బనగానపల్లె సిఐ సుబ్బరాయుడు చేతులు మీదుగా సోమవారం రాయలసీమ కర్తవ్య దీక్ష కరపత్రాన్ని రాయలసీమ స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగింది.ఈ సందర్భంగా రాయలసీమ స్టీరింగ్ కమిటీ నాయకులు ఆర్ వి ఎస్ సీమకృష్ణ, మాట్లాడుతూ రాయలసీమకు నీళ్లు నిధులు నియామకలలో సమాన వాటా కోసం రాయలసీమ కర్తవ్య దీక్షను విజయవంతం చేయాలని తెలియజేశారు.అధేవిధంగా సిద్దేశ్వరం సంగమేశ్వరం వద్ద కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జి బదులు రోడ్డు కం బ్యారేజ్ నిర్మించాలని మరియు అప్పర్ భద్ర ప్రాజెక్టును కర్ణాటక ప్రభుత్వం నిర్మించడం వలన రాయలసీమకు తుంగభద్ర నది నుండి రావాల్సిన నికర జలాలు హెచ్.ఎల్.సి,ఎల్ఎల్సి మరియు కేసీ కెనాల్ బైరవాణి వతిప్ప ప్రాజెక్టుకు రైతులకు నీళ్లు రావన్నారు.వెంటనే ఆ ప్రాజెక్టును నిలుపుదల చేయాలని కోరుతూ మరియు నీళ్లు,నిధులు, నియామకాల లో న్యాయం చేయాలని కోరుతూ ఈనెల ఏప్రిల్ 24వ తారీఖున కర్నూలు పట్టణంలోని ఎస్టీ బీసీ మైదానంలో రాయలసీమ స్టీరింగ్ కమిటీ చైర్మన్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఒక్కరోజు నిరసన దీక్ష కార్యక్రమంను చేపడుతున్నామని ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని వారు అన్నారు.ఈకార్యక్రమంలోసుధాకర్,రాము,రవింద్ర, నాగభూషణం,బజారి,గోపాల్ రమేష్,సామ్రి తదితరులు పాల్గొన్నారు.

About Author