PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సంక్షేమ ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించండి

1 min read

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు:  పట్టణం లో 9 వ వార్డ్ చిన్న కమేల నుండి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక ,ఆంధ్రప్రదేశ్ స్టేట్ వీరశైవ లింగాయత్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్  శ్రీ వై రుద్ర గౌడ్ , వార్డ్ కౌన్సిలర్ రాజారత్నం, పార్టీ శ్రేణులతో కలిసిఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.సంక్షేమ పథకాలతో ప్రతి ఇంటికీ మేలు చేసిన ప్రభుత్వాన్ని మరోసారి ఆశ్వీరదించాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక విన్నవించారు. వ్యాపారులు, వృ ద్ధులు, మహిళలను ఆప్యాయంగా పలకరిస్తూ ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  సంక్షేమ పథకాలను మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్దిదారులకు అందించారని గుర్తుచేశారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మరోసారి వైఎస్ జగనన్నను ముఖ్యమంత్రిగా గెలిపించుకో వాలని పిలుపునిచ్చారు. గత తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో సంక్షేమ పథకాలు జన్మభూమి కమిటీలు చెప్పిన వారికే అందేవని, ఇప్పుడు జగనన్న పాల నలో పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ అందుతున్నాయని తెలిపారు. ఈ ప్రచారంలో వార్డు కౌన్సిలర్ రాజారత్నం వార్డ్ నాయకులు ఫక్రుద్దీన్,టి.కే గౌస్, జిలాన్, రఫీ,ఖజా, రాష కుర్ని కార్పొరేషన్ చైర్మన్ బుట్టా శారద,పట్టణ అధికార ప్రతినిధి సునీల్ కుమార్, జిల్లా వక్ బోర్డు ఉపాధ్యక్షులు రియాజ్ అహ్మద్, మునిసిపల్ కోఆప్షన్ మెంబర్ అబ్రార్,మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ బి.ఎన్. నాగరాజ్, కౌన్సిలర్లు, సుధాకర్, వాహీద్, నీలకంఠ,అమానుల్లా,ఇన్చార్జిలు,ప్రతాప్ రెడ్డి, తార రాజశేఖర్, షాబుద్దీన్, రుద్రాక్షల బజారి, నాయకులు డిష్ రఫీ, మాధవ్ స్వామి, యు రమేష్, ఇంద్రసేనారెడ్డి, గట్టు కాజా, షేక్ చాంద్ బాషా, రహంతుల్లా, ఖిబులా హుస్సేని, గురవయ్య మహబూబ్ బాషా, రజాక్,యూసుఫ్,వడ్డే రంగన్న,రఘువీరా, ప్రభాకర్,గోకారి,బుట్టా యూత్ నాయకులు ఫయాజ్, ఉబేద్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author