PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యువగలం పాదయాత్ర ముగింపు సభని విజయవంతం చేయండి

1 min read

నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చిన గౌరు

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు  నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నందికొట్కూరు నియోజకవర్గ ఇంచార్జి గౌరు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో  శుక్రవారం అల్లూరు గ్రామంలో  నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇంచార్జి మాండ్ర శివానంద రెడ్డి స్వగృహంలో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు దేవేర్ల మురళి హాజరయ్యారు. ఈ సందర్భంగా గౌరు వెంకట రెడ్డి మాట్లాడుతూ ఈనెల 20వ తేదీన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి  నారా లోకేష్  యువగళ్ళం పాదయాత్ర ముగింపు సభ మరియు ఎన్నికల శంఖారావం సభకు అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ,పాల్గొని విజయవంతం చేయాలని  నియోజవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. నందికొట్కూరు   నియోజకవర్గంలో భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రతి బూత్ లో దాదాపు 70 శాతం  పైగా కార్యక్రమాన్ని తప్పనిసరిగా పూర్తి చేయాలని సూచించారు.  కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సి సెల్ ఆర్గనైసింగ్ సెక్రెటరీ జయసూర్య,మాజీ ఎంపీపీ ప్రసాద్ రెడ్డి,మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ గుండం రమణారెడ్డి, మాజీ పిపి నాగముని, ఎంపీటీసీ  తిమ్మారెడ్డి, మండల  కన్వీనర్లు, వెంకటేశ్వర్లు యాదవ్, నారపురెడ్డి, రవీంద్రారెడ్డి, కాతా రమేష్ రెడ్డి, మహేశ్వరరెడ్డి, ఓబుల్ రెడ్డి, క్లస్టర్ కో ఆర్డినెటర్లు రఘురామిరెడ్డి, లింగుస్వామి గౌడ్, హరనాథ్ రెడ్డి, చంద్రశేఖర్, గిరీశ్వరరెడ్డి, ముర్తుజావలి, జాకీర్ హుస్సేన్, వాసురెడ్డి, జడ్ వెంకటరెడ్డి, నియోజకవర్గ అధికార ప్రాధినిది చిన్న వెంకటస్వామి,  యూనిట్ ఇంచార్జ్ లు, బూత్ ఇంచార్జ్ లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author