NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘ బాలికల విద్యకు.. ‘ మలబార్​ ’ ప్రాధాన్యం..

1 min read

209 మందికి స్కాలర్​ షిప్​ లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

  • సామాజిక సేవలో..మలబార్​ భేష్​ అని కితాబు..

కర్నూలు, న్యూస్​ నేడు:బాలికల విద్యకు మలబార్​ గోల్డ్​ అండ్​ డైమండ్స్​ సంస్థ ప్రాధాన్యమివ్వడం అభినందనీయమన్నారు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి. మంగళవారం నగరంలోని ఓ హోటల్ లో మలబార్​ చారిటబుల్​ ట్రస్ట్​ ద్వారా ఉమ్మడి కర్నూలు జిల్లాలో  విద్యనభ్యసిస్తున్న 209 విద్యార్థినులకు  స్కాలర్ షిప్​లు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి చేతుల మీదుగా బాలికలకు స్కాలర్​ షిప్​ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారత వ్యాపార సంస్థ, విభిన్న వ్యాపారాల సమ్మేళనం, మలబార్ గోల్డ్ & డైమండ్స్ యొక్క మాతృ సంస్థ మలబార్ గ్రూప్ 2024-2025 విద్యా సంవత్సరానికి  బాలికల కోసం విద్యా స్కాలర్షిప్లను పంపిణీ చేయడం ప్రశంసనీయమన్నారు. బాలికల విద్యకు మద్దతు ఇవ్వడంలో మలబార్ గ్రూపు యొక్క నిబద్ధతను తెలుపుతుందన్నారు.  సామాజిక సేవలో మలబార్ గోల్డ్​ అండ్​ డైమండ్స్​ సంస్థ ముందుండటం సంతోషించదగ్గ విషయమన్నారు.  అనంతరం స్టోర్​ హెడ్​ ఫయాజ్​ మాట్లాడుతూ దేశంలో 21000 మంది బాలికల విద్యకు మద్దతుగా 16 కోట్ల రూపాయలను కేటాయించారు. ఆంధ్ర రాష్ట్రంలోని 142 కళాశాలల్లో చదువుతున్న 1,928 మంది బాలికల విద్యకు మద్దతుగా ఆంధ్ర రాష్ట్రంలో ఈ స్కాలర్షిప్ కార్యక్రమానికి రూ 1.67 కోట్లు కేటాయించింది. వీరిలో కర్నూలు, నంద్యాల షోరూం కు చెందిన 209 మంది విద్యార్థులు, 18,64,000 లక్షల రూపాయల విలువగల స్కాలర్షిప్లు మంగళవారం మలబార్​ గోల్డ్​ అండ్​ డైమండ్స్​ సంస్థ షోరూమ్​  అందించిందన్నారు. కార్యక్రమంలో డివిఈఓ పరమేశ్వర రెడ్డి, కేవీఆర్​ కళాశాల ప్రిన్సిపల్​ లాలెప్ప, ప్రిన్సిపల్స్​ నాగ స్వామి నాయక్​ బి. క్యాంప్​ ప్రభుత్వ వొకేషనల్​, సుంకన్న టౌన్​ మోడల్​ కాలేజి, సయ్యద్​ బాబు పాణ్యం కాలేజి, విజయ శేఖర్​, మధు, కర్నూలు షోరూం హెడ్​ ఫయాజ్​, మార్కెటింగ్​ మేనేజర్​ నూర్​ వుల్లా తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *