PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘మలబార్​ ఇన్వెస్టిమెంట్స్’​.. డీఐఎఫ్​సీలోకి బదిలీ…

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: ప్రపంచ వాణిజ్యరంగంలో తనదైన ముద్ర వేసుకున్న మలబార్​ గోల్డ్​ అండ్​ డైమండ్స్​ సంస్థ యొక్క అంతర్జాతీయ పెట్టుబడి విభాగమైన మలబార్​ ఇన్వెస్టిమెంట్స్​ కార్యకలాపాలను దుబాయ్​ ఇంటర్నేషనల్​ ఫైనాన్షియల్​ సెంటర్​ (డీఐఎఫ్​సీ)కి బదిలీ చేశారు. డీఐఎఫ్​సీ గవర్నర్​ మరియు డీఎఫ్​ఎం చైర్మన్​ ఎక్స్​లెన్సీ ఎస్సా కాజీమ్​ సమక్షంలో మలబార్​ గ్రూప్​ చైర్మన్​ ఎం.పీఅహమ్మద్​ నాస్టాక్ దుబాయ్​ మార్కెట్​ వేడుకను ప్రారంభించారు. ఈ మేరకు ఆ సంస్థ కర్నూలు షోరూం హెడ్​ ఫయాజ్​, మార్కెటింగ్​ మేనేజర్​ నూర్​వుల్లా గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. మలబార్​ ఇన్వెస్టిమెంట్స్​ అంతర్జాతీయ కార్యకలాపాల షేర్లు నాస్టాక్​ దుబాయ్​ యొక్క సెంట్రల్​ సెక్యురిటీస్​ డిపాజిటరీ (సీఎస్​డీ)లో రిజిష్టర్​ చేయబడ్డాయని, ఈ ఘట్టం పెట్టుబడిదారులతో సంబంధాలను బలోపేతం చేస్తుందని ఆకాంక్షించారు. కంపెనీ వాటాలకు సంబంధించి కార్పొరేట్​ కార్యకలాపాలు పారదర్శకంగా… నియంత్రణతో .. సమర్థవంతంగా నిర్వహిస్తామన్నారు.

About Author