PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మల్లన్నకు భారీహుండీ ఆదాయం

1 min read

పల్లెవెలుగు వెబ్ శ్రీశైలం: ఉభయ దేవాలయాల్లో జరిగిన హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైలం దేవస్థానానికి రూ. 2,87,01,092/- నగదు రాబడిగా లభించింది.ఈ హుండీ ఆదాయాన్ని భక్తులు గత 22 రోజులలో22.02.2023 నుండి 15.03.2023 వరకు సమర్పించడం జరిగింది.ఈ నగదుతో పాటు 162 గ్రాముల బంగారం, 7 కేజీల 110 గ్రాముల వెండి లభించాయి.అదేవిధంగా 191 కెనెడా 110 ఖత్తార్ డాలర్లు 4. ఇంగ్లాండు డాలర్లు – 35, మలేషియా రింగిట్స్ -7 మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి.పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టడం జరిగింది. ఈ హుండీల లెక్కింపులో కార్యనిర్వహణాధికారి శ్రీ ఎస్. లవన్న, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది.మరియు శివసేవకులు పాల్గొన్నారు.

About Author