PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కన్నుల పండుగగా మల్లన్న ప్రభోత్సవం

1 min read

పల్లెవెలుగు వెబ్​: శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాల వేళ శ్రీగిరులు ప్రణవనాదంతో ప్రతిధ్వనించాయి. భక్తజనం పరమేశ్వరుడి సేవలో తరించారు. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం అశేష భక్తుల నడుమ ప్రభోత్సవం సాగింది. కన్నడ మహారాష్ట్ర నుంచి వచ్చిన భక్తులు  కనులారా తిలకించి స్వామి అమ్మవార్లను దర్శించుకుని తరించారు. వివిధ రకాల ప్రత్యేక పుష్పాలతో అలంకరించిన ప్రభపై స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం నిర్వహించు ముందుర ఆలయంలో లో స్వామి అమ్మవార్లు ప్రత్యేక పూజలు చేశారు.  ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు అర్చక వేదపండితులు పాల్గొని గ్రామోత్సవం నిర్వహించారు భక్తులకు స్వామి అమ్మవార్ల ఆశీస్సులు, అందజేశారు. ఆలయ చైర్మన్ చక్రపాణి రెడ్డి ఆలయ ఈవో లవన్న ఆలయ వేద పండితులు ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

About Author